26, జనవరి 2021, మంగళవారం

మ‌ద‌న‌ప‌ల్లి హ‌త్యల కేసు.. డెల్యూష‌న్స్ అనే వ్యాధితోనే దారుణానికి పాల్ప‌డ్డ పురుషోత్తం, ప‌ద్మ‌జ‌..

చిత్తూరులోని మ‌దన‌ప‌ల్లిలో త‌మ కుమార్తెల‌ను హ‌త్య చేసిన కేసులో త‌ల్లిదండ్రులు పురుషోత్తం, ప‌ద్మ‌జ‌ల‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో నిందితుల‌ను మ‌ద‌న‌ప‌ల్లి స‌బ్ జైలుకు త‌ర‌లించారు. త‌మ ఇద్ద‌రు కుమార్తెల‌ను వారు క్షుద్ర పూజ‌ల పేరిట బ‌లితీసుకున్నారు. అయితే జైలుకు త‌ర‌లించే ముందు వారిద్ద‌రికీ మాన‌సిక వైద్య ప‌రీక్ష‌లు చేయించ‌గా షాకింగ్ విష‌యం బ‌య‌ట ప‌డింది. 

మ‌ద‌న‌ప‌ల్లి హ‌త్యల కేసు.. డెల్యూష‌న్స్ అనే వ్యాధితోనే దారుణానికి పాల్ప‌డ్డ పురుషోత్తం, ప‌ద్మ‌జ‌..

పురుషోత్తం, ప‌ద్మ‌జ‌ల‌కు డెల్యూష‌న్స్ అనే వ్యాధి ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఇది ఒక మానసిక వ్యాధి అని, ఈ వ్యాధి బారిన ప‌డ్డ‌వారు తాము న‌మ్మిన విష‌యాల‌నే నిజ‌మ‌ని భావిస్తార‌ని అన్నారు. కాగా ప‌ద్మ‌జ తండ్రి అదే మాన‌సిక వ్యాధితో చ‌నిపోగా, ఆమె మేన‌త్త కూడా ఇదే వ్యాధితో బాధ‌ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపారు. పురుషోత్తం, ప‌ద్మ‌జ‌ల‌కు చికిత్స అందిస్తే కోలుకుంటార‌ని అన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...